అవార్డు అందుకున్న వెంకన్నను సన్మానించిన కెసిఆర్ ఆత్మగౌరవ సముదాయం కాలనీవాసులు

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డి( Nevuri Venkat Reddy ) ఈనెల 31న ఢిల్లీలో జాతీయస్థాయి అవార్డు అందుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ శుక్రవారం గ్రామపంచాయతీ ఆవరణలో కెసిఆర్ ఆత్మగౌరవ సముదాయం కాలనీవాసులు అందరు కలిసి వెంకట్ రెడ్డిని శాలువాతో ఘనంగా సన్మానించారు.

ఇటు ఊరు అభివృద్ధికి పాటుపడుతూ, సామాజిక సేవారంగంలో ముందున్న వెంకన్న ఇంకా ఎన్నో అవార్డులు అందుకోవాలని ఈ సందర్భంగా వారు అన్నారు.

ఈ కార్యక్రమంలో కెసిఆర్ ఆత్మగౌరవ సముదాయం కానివాసులు తదితరులు పాల్గొన్నారు.

రౌడీ షీటర్స్ సత్ప్రవర్తనతో మెలగాలి - కోనరావుపేట ఎస్ఐ శేఖర్ రెడ్డి

Latest Rajanna Sircilla News