తెలంగాణ సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) కీలక సమీక్షలు నిర్వహించనున్నారు.ఈ మేరకు ఆరు గ్యారెంటీలపై ఉన్నతాధికారులతో ఆయన సమావేశం కానున్నారు.గృహజ్యోతి(Gruha Jyothi Scheme ), రూ.500 కే గ్యాస్ సిలిండర్ పథకాలపై కేబినెట్ సబ్ కమిటీతో రేవంత్ రెడ్డి సమావేశమై చర్చించనున్నారు.అదేవిధంగా తాగునీటిపై సంబంధిత విభాగాలతో సమీక్ష నిర్వహించనున్నారు.
కాగా కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీల్లో ( six guarantees (ఐదు గ్యారెంటీలకు ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించిన సంగతి తెలిసిందే.ఈక్రమంలోనే ఇప్పటికే రెండు హామీలను అమలు చేస్తున్న రేవంత్ రెడ్డి సర్కార్ మరో రెండు హామీలను ఒకటి రెండు రోజుల్లో అమలు చేయాలని కీలక నిర్ణయం తీసుకుంది.