శీతాకాలం ప్రారంభమైంది.చలి పులి పంజా విసిరేందుకు సిద్ధం అవుతోంది.
అయితే ఈ సీజన్లో పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా చాలా మంది కామన్గా ఫేస్ చేసే సమస్య డ్రై స్కిన్.ఎన్ని లోషన్లు, మాయిశ్చరైజర్లు వాడినా.
ముఖ చర్మం ఇట్టే పొడి బారి పోతుంటుంది.అయితే ఇప్పుడు చెప్పబోయే న్యాచురల్ సీరమ్ను వాడితే గనుక.
మీ స్కిన్ తేమగా, మృదువుగా ఉంటుంది.అసలు డ్రై స్కిన్ సమస్యే దరి చేరకుండా ఉంటుంది.
మరి ఆ సీరమ్ ఏంటీ.? దాన్ని ఎలా తయారు చేసుకోవాలి.? ఎప్పుడు వాడాలి.? వంటి విషయాలను చూసేద్దాం పదండీ .
ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో స్పూన్ అవిసె గింజలు, అర కప్పు నీళ్లు పోసి నానబెట్టుకోవాలి.అలాగే మరోవైపు ఐదారు బాదం పప్పులను కూడా నానబెట్టుకుని పై పొట్టు తీసి పెట్టుకోవాలి.
ఇప్పుడు మిక్సీ జార్లో నీటితో సహా అవిసె గింజలు, పొట్టు తీసిన బాదం పప్పులు వేసి గ్రైండ్ చేసుకుని.జ్యూస్ను మాత్రం ఫిల్టర్ చేసుకోవాలి.
ఆ తర్వాత ఈ జ్యూస్లో రెండు విటమిన్ ఇ క్యాప్సుల్స్ఆయిల్, అర స్పూన్ బాదం ఆయిల్, ఒక స్పూన్ కాచి చల్లార్చిన పాలు, ఒక స్పూన్ అలోవెర జెల్ మరియు కొద్దిగా గ్లిజరిన్ యాడ్ చేసి మిక్స్ చేసుకుంటే సీరమ్ సిద్ధమైనట్టే.దీనిని ఒక గాజు సీసాలో నింపుకుని.ఫ్రిజ్లో పెట్టుకుంటే వారం నుంచి పది రోజుల పాటు నిల్వ ఉంటుంది.
ఇక ఈ న్యాచురల్ సీరమ్ను ఎలా వాడాలంటే.
రోజూ రాత్రి నిద్రించే ముందు ముఖానికి, మెడకు ఏమైనా మేకప్ ఉంటే తొలగించి వాటర్తో శుభ్రం చేసుకోవాలి.ఆపై సీరమ్ను స్మూత్గా ముఖానికి, మెడకు అప్లై చేసుకుని.
ఉదయం నిద్ర లేవగానే చల్లటి నీటితో వాష్ చేసుకోవాలి.ఇలా రెగ్యులర్గా చేస్తే చర్మం మృదువుగా, మాయిశ్చరైజర్గా ఉంటుంది.
మరియు మొటిమలు, మచ్చలు, ముడతలు వంటివి ఉన్నా తగ్గు ముఖం పడతాయి.