దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాం( Delhi Liquor Scam ) కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్( CM Arvind Kejriwal ) కు బెయిల్ మంజూరు అయింది.ఈ మేరకు రూ.15 వేల పూచీకత్తుతో పాటు రూ.లక్ష సెక్యూరిటీ డిపాజిట్ తో రౌస్ అవెన్యూ కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు అయింది.

కాగా కేజ్రీవాల్ మద్యం కుంభకోణం కేసులో విచారణ నిమిత్తం రౌస్ అవెన్యూ కోర్టు( Rouse Avenue court )కు హాజరైన సంగతి తెలిసిందే.ఇప్పటికే ఈ కేసులో ఈడీ అధికారులు ఎనిమిది సార్లు నోటీసులు ఇచ్చినప్పటికీ కేజ్రీవాల్ గైర్హాజరు అవుతూ వస్తున్నారు.దీంతో ఈడీ కోర్టును ఆశ్రయించింది.ఈ నేపథ్యంలో విచారణకు హాజరైన కేజ్రీవాల్ కు రౌస్ అవెన్యూ కోర్టు బెయిల్ మంజూరు చేసింది.







