కొత్త సచివాలయంలో సీఎం కేసీఆర్ తొలి రివ్యూ

తెలంగాణ నూతన సచివాలయంలో సీఎం కేసీఆర్ తొలి రివ్యూ నిర్వహించనున్నారు.పాలమూరు ఎత్తిపోతల పథకంపై కేసీఆర్ సమీక్ష చేయనున్నారు.

ఈ సమీక్షా సమావేశంలో ఉద్దండాపూర్ నుంచి తాగునీరు తరలింపు పనులపై చర్చించనున్నారు.మరోవైపు కొత్త సచివాలయంలో ఉద్యోగుల సందడి నెలకొంది.

ఈ క్రమంలోనే సెక్రటేరియట్ లో నేటి నుంచి ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు.ఈ మేరకు ఉద్యోగుల ఐడీ కార్డు తనిఖీ చేసిన భద్రతా సిబ్బంది లోపలికి అనుమతిస్తున్నారు.

దీంతో తొలిరోజు సమీక్షలతో మంత్రులు బిజీబిజీగా ఉండనున్నారు.అయితే ఇప్పటికే మంత్రులు హరీశ్ రావు, ప్రశాంత్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, శ్రీనివాస్ గౌడ్ లు సచివాయంకు చేరుకున్నారు.

Advertisement
కూతురు కోసం కొరియా వెళ్లిన ఇండియన్ ఫాదర్.. వీడియో చూస్తే ఫిదా..

తాజా వార్తలు