పవన్ వ్యాఖ్యలపై సీఎం జగన్ కౌంటర్

ఇటీవల ప్రెస్ మీట్ లో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై సీఎం జగన్ స్పందించారు.

అవనిగడ్డ కార్యక్రమంలో సీఎం జగన్ మాట్లాడుతూ ఏం చేయలేని వాళ్లు బూతులు తిడుతున్నారు.

చెప్పులు చూపించి బూతులు తిడుతున్నారని అన్నారు.ఇలాంటి వాళ్లా మన నాయకులు.దత్తపుత్రుడితో దత్తతండ్రి ఏమేమీ మాట్లాడిస్తున్నాడో అంతా చూస్తున్నాం.3 రాజధానుల వల్ల కాదు, 3 పెళ్లిళ్ల వల్లే మేలు జరుగుతుందని చెబుతున్నారు.ఒక్కొక్కరు 3-4 పెళ్లిళ్లు చేసుకోమని చెబితే అక్కచెల్లెళ్ల జీవితాలు ఏం కావాలి.

ఇలాంటివారు మనకు దశ-దిశా చూపగలరా.ఒక్క జగన్ ను కొట్టడానికి అంతమంది ఏకమయ్యారు అని అన్నారు.

మరో అరుదైన గౌరవాన్ని అందుకున్న రామ్ చరణ్.. క్లీంకార పుట్టాక అంతా శుభమే!
Advertisement

తాజా వార్తలు