YS Jagan : ఒకరోజు బస్సు యాత్రకు విరామం ఇచ్చిన సీఎం జగన్..!!

“మేమంతా సిద్ధం” పేరిట వైసీపీ అధినేత వైయస్ జగన్( YS Jagan ) బస్సు యాత్ర ప్రారంభించడం తెలిసిందే.మార్చి 27వ తారీకు ఇడుపులపాయలో మొదలుపెట్టిన ఈ యాత్ర ఇచ్చాపురం వరకు సాగనుంది.

 Cm Jagan Gave Break To Bus Trip For One Day-TeluguStop.com

జిల్లాల వారీగా 21 రోజులపాటు సాగనున్న ఈ యాత్రలో గతంలో “సిద్ధం” సభలు ( Siddam )జరిగిన నాలుగు జిల్లాలు మినహా మిగతా 21 జిల్లాలలో నిర్వహిస్తున్నారు.ప్రస్తుతం రాయలసీమలో జరుగుతున్న ఈ బస్సు యాత్రకు జనం నుండి మంచి స్పందన వస్తూ ఉంది.

ఈ బస్సు యాత్రలో ఉదయం స్థానిక పార్టీ నేతలతో భేటీ అవుతూ సాయంత్రం బహిరంగ సభలలో సీఎం జగన్ పాల్గొంటున్నారు.

ఇదిలా ఉంటే “మేమంతా సిద్ధం” బస్సు యాత్రకు( Mematha siddam ) ఒక రోజు విరామం ప్రకటించారు.ఆదివారం ఈస్టర్ కారణంగా.బస్సు యాత్రకు సీఎం జగన్ బ్రేక్ ఇవ్వటం జరిగింది.

ఈ క్రమంలో ఈస్టర్ వేడుకలలో సీఎం జగన్ పాల్గొనబోతున్నారు.అనంతరం అనంతపురం జిల్లా శివారులోని సంజీవపురంలో సోమవారం తిరిగి జగన్ బస్సు యాత్రను ప్రారంభించనున్నారు.ప్రస్తుతం అనంతపురం జిల్లాలో ఈ యాత్ర సాగుతోంది.2024 ఎన్నికలను వైయస్ జగన్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.ఎట్టి పరిస్థితులలో అధికారం కోల్పోకుండా ఎక్కడికక్కడ జాగ్రత్త పడుతున్నారు.ఇంకా ఎన్నికలకు 40 రోజులు మాత్రమే సమయం ఉండటంతో పూర్తిగా ప్రజా క్షేత్రంలో ఉండే విధంగా వైసీపీ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube