హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఘర్షణ చెలరేగడంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.ఎస్ఎఫ్ఐ, ఏబీవీపీ విద్యార్థుల మధ్య వివాదం నెలకొంది.
స్టూడెంట్స్ యూనియన్ ఎన్నికల నేపథ్యంలో వాల్ పోస్టర్స్ అతికించే విషయంలో విద్యార్థుల మధ్య వివాదం చెలరేగింది.అది కాస్తా ముదరడంతో ఇరు వర్గాలకు చెందిన స్టూడెంట్స్ కొట్లాటకు దిగినట్లు సమాచారం.
పరస్పర దాడులతో పలువురు విద్యార్థులకు గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు.అనంతరం ఎస్ఎఫ్ఐ విద్యార్థులు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.







