'భోళా శంకర్‌' అఫిషియల్‌ అనౌన్స్‌మెంట్‌

మెగా స్టార్‌ చిరంజీవి మరియు మెహర్‌ రమేష్ ల కాంబోలో రూపొందబోతున్న సినిమా భోళా శంకర్‌.ఈ సినిమా ప్రకటించి నెలలు గడుస్తోంది.

కాని ఇప్పటి వరకు కొన్ని కారణాల వల్ల పట్టాలెక్కలేదు.ఎట్టకేలకు సినిమాను మొదలు పెట్టబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చింది.

నవంబర్‌ 11న ఈ సినిమా పూజా కార్యక్రమాలు నిర్వహించబోతున్నట్లుగా నిర్మాణ సంస్థ అధికారిక ట్విట్టర్ పేజీలో షేర్ చేయడం జరిగింది.ఆ వెంటనే అంటే 15 వ తారీకు నుండి షూటింగ్ కు వెళ్లబోతున్నారు.

ఈ సినిమా లో కీర్తి సురేష్‌ నటిస్తున్న విషయం తెల్సిందే.ఆమె చిరంజీవికి చెల్లి పాత్రలో కనిపించబోతున్నారు.

Advertisement

భారీ అంచనాల నడుమ రూపొందుతున్న భోళా శంకర్ సినిమా లో హీరోయిన్ ఎవరు అనే విషయం ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.సినిమా లో చిరంజీవి మరియు కీర్తి సురేష్ ల బాండింగ్ గురించి చాలా ముచ్చట్లు వినిపిస్తున్నాయి.

మొత్తానికి భోళా శంకర్ సినిమా పట్టాలెక్కే అవకాశాలు పక్కా అని తేలిపోయింది.ప్రస్తుతం చిరంజీవి ఆచార్య ను విడుదల చేసేందుకు సిద్దంగా ఉంచాడు.

మరో వైపు గాడ్‌ ఫాదర్‌ సినిమా షూటింగ్‌ సగం కు పైగా పూర్తి చేశాడు.ఇక ఈ సినిమా ను పట్టాలెక్కించేందుకు సిద్దం అయ్యాడు.

నిన్న మొన్నటి వరకు భోళా శంకర్ సినిమా ను మరోసారి వాయిదా వేసి బాబీ దర్శకత్వం లో సినిమా ను ముందుకు తీసుకు వచ్చేలా చర్యలు జరుగుతున్నాయి అంటూ ప్రచారం జరిగింది. 

అభిమన్యుడి మరణం శ్రీకృష్ణుడికి ముందే తెలుసా..?
సూర్య కంగువ సినిమా మీద ఫోకస్ చేసిన అమీర్ ఖాన్...కారణం ఏంటంటే..?

ఈసమయంలోనే భోళా శంకర్ సినిమా అధికారిక ప్రకటన వచ్చేసింది.భారీ అంచనాల నడుమ రూపొందుతున్న భోళా శంకర్ తో మెహర్‌ రమేష్ మళ్లీ తన ఫామ్‌ ను కొనసాగిస్తాడేమో చూడాలి.ఈ సినిమా తమిళంలో సూపర్‌ హిట్‌ అయిన అజిత్ వేదాళం కు రీమేక్ అనే విషయం తెల్సిందే.

Advertisement

చిరంజీవి చేస్తున్న గాడ్‌ ఫాదర్ మరియు భోళా శంకర్‌ రెండు సినిమా లు కూడా రీమేక్ అనే విషయం తెల్సిందే.భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ సినిమా లు చిరంజీవి అభిమానులకు ఖచ్చితంగా ఎంటర్‌ టైన్ మెంట్‌ ను అందిస్తాయనే నమ్మకం వ్యక్తం అవుతోంది.

తాజా వార్తలు