టాలీవుడ్ సినీ ప్రేక్షకులకు మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.చిరంజీవి ప్రస్తుతం వరుసగా సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.
సినిమా హిట్ ఫ్లాప్ తో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్నారు మెగాస్టార్.ఈ క్రమంలోనే ఈ ఏడాది ఆరంభంలో వాళ్తేరు వీరయ్య సినిమాతో ప్రేక్షకులను పలకరించారు చిరు.
ఈ సినిమా విడుదల సూపర్ హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే.
ప్రస్తుతం చిరంజీవి భోళా శంకర్ సినిమాలో( Bhola Shankar Movie ) నటిస్తున్న విషయం తెలిసిందే.మొహర్ రమేష్( Director Mehar Ramesh ) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్లను విడుదల చేసిన విషయం తెలిసిందే.
ఆ పోస్టర్స్ సినిమాపై అంచనాలను మరింత పెంచేసాయి.కాగా ఈ సినిమా ఆగస్టు 11వ తేదీ మనందరికీ తెలిసిందే.
విడుదల తేదికి సమయం దగ్గర పడటంతో చిత్ర యూనిట్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ను శరవేగంగా జరుగుతుంది.అదే సమయంలో నిర్మాతలు ఈ సినిమా బిజినెస్ను మొదలు పెట్టేశారు.
ఇందులో భాగంగానే తాజాగా ఆంధ్ర ప్రదేశ్ లోని అన్ని ఏరియాల హక్కులను ఫ్యాన్సీ రేటుకు అమ్మినట్లు తాజాగా ఒక వార్త ఫిలిం నగర్ లో హల్చల్ చేస్తోంది.విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం… భోళా శంకర్ సినిమా ఆంధ్ర ప్రదేశ్ లోని అన్ని ఏరియాల రైట్స్ కలిపి 45 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయినట్లు తెలిసింది.అందులో ఒక్క వైజాగ్ రైట్స్ మాత్రమే ఏకంగా 10 కోట్లు పలికినట్లు సమాచారం.కాగా చిరు గత సినిమా అయినా వాల్తేరు వీరయ్య సినిమాకి మాత్రం ఆంధ్రప్రదేశ్ మొత్తం లో 54 కోట్ల రూపాయల బిజినెస్ జరిగింది.