మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమా తో గత ఏడాదిలోనే రావాల్సి ఉన్నా కూడా కరోనా వల్ల ఈ ఏడాది మే కు వాయిదా వేశారు.మళ్లీ కరోనా సెకండ్ వేవ్ తో సినిమా వాయిదా పడింది.
ఇప్పటి వరకు ఆచార్య విడుదల అవ్వలేదు.అదుగో ఇదుగో అంటూ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో సినిమాను విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించారు.
ఇప్పటి వరకు ఆచార్య సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న అభిమానులు ఇంకా ఆచార్య వర్క్ ఏం జరుగుతుంది అంటూ జుట్టు పీక్కుంటున్నారు.అసలు విషయం ఏంటీ అంటే వారం రోజుల క్రితం ఆచార్య తుది ఎడిటింగ్ పూర్తి అయ్యింది.
డబ్బింగ్ మరియు రి రికార్డింగ్ కూడా పూర్తి అయ్యిందట.సినిమా విడుదలకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేసి ఫస్ట్ కాపీని సిద్దం చేశారట.సినిమా ను సెన్సార్ కోసం కూడా సిద్దం చేసిన దర్శకుడు కొరటాల శివ ప్రస్తుతం ఎన్టీఆర్ తో సినిమా కోసం రెడీ అయ్యాడు అంటూ వార్తలు వస్తున్నాయి.ఆచార్య సినిమా వర్క్ పూర్తి అయినా కూడా ఫిబ్రవరి వరకు సినిమా కోసం ఆగాల్సిందే అంటూ యూనిట్ సభ్యులు ఇప్పటికే ప్రకటించారు.
సినిమా రెడీ అయ్యింది.కాని విడుదల ఇప్పుడు కాదని అభిమానులు ఉసూరుమంటున్నారు.అదుగో ఇదుగో వంద రోజుల్లో ఆచార్య అంటూ ప్రారంభ సమయంలో మేకర్స్ చేసిన ప్రకటనలు కరోనా వల్ల మొత్తం తలకిందులు అయ్యాయి.వంద రోజుల్లో పూర్తి అవ్వాల్సింది కాస్త రెండేళ్ల సమయం పట్టింది.
సినిమా విడుదలకు ఇంత సమయం రావడం పట్ల మెగా అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.కాని వరుసగా ఇతర సినిమాలు ముందుగానే ఫిక్స్ అయ్యి ఉండటం వల్ల మెగా స్టార్ ఆచార్య ను కాస్త ఆలస్యంగా బరిలోకి దించబోతున్నారు.
మొత్తం సినిమా రెడీ అయ్యింది కనుక ఎలాంటి అభ్యంతరం లేకుండా బరిలోకి దించడమే.ఇప్పటికే ఫస్ట్ కాపీని చూసి చిరంజీవి మరియు ముఖ్యులు సంతృప్తి చెందారని తెలుస్తోంది.
విడుదల సమయంలో ఒక్కటి రెండు చిన్న చిన్న మార్పులు చేర్పులు చేసి విడుదల చేయడమే అవుతుందని ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.