కొందరికి నాన్ వెజ్ లేనిదే ముద్ద దిగదు.అదీగాక కరోనా లోకాన్ని ఏలుతున్న సమయంలో చికెన్ తినండి ఆరోగ్యాన్ని కాపాడుకోండనే స్లోగన్స్ ఎక్కువగా వింటున్నాం.
ఇలాంటి నేపధ్యంలో అందరికి అందుబాటులో ఉండే నాన్ వెజ్ ఏంటంటే చికెన్ అని టక్కున చెప్పవచ్చూ.
ఎందుకంటే మటన్ ధర 700 వందలకు పైగా ఉంది కాబట్టి ఈ నేపధ్యంలో రోజురోజుకు చికెన్ ధరలు పెరుగుతుండటంతో మాంసం ప్రియుల్లో ఆందోళన వ్యక్తం అవుతుందట.
చికెన్ ధర అమాంతం పెరగడంతో అది కాస్తా తమకు అందని ద్రాక్ష గానే మిగిలిందని వాపోతున్నారట.
ఇకపోతే గత వారం రోజుల క్రితం రూ.180 ఉన్న చికెన్ ధర నేడు రూ.280 ధర పలికి చికెన్ ప్రియులను టెన్షన్ పెడుతుందట.ఇక సాధారణంగా వేసవిలో ఎండ తీవ్రత దృష్ట్యా చికెన్ ధర తగ్గుతుండగా ఈ సంవత్సరం కరోనా ప్రభావంతో పెళ్ళిళ్ళు, శుభకార్యలు కూడా లేక పోయినా ధరలు అమాంతం పెరగడం తో చికెన్ ప్రియులు వాపోతున్నారట.