ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది రాజకీయ నాయకులు తామ రాజకీయ ఉనికి కోసం, ఎన్నికల బరిలో నిలబడటానికి రాజకీయ వేదికలు సిద్ధం చేసుకుంటున్నారు.టీడీపీ నుంచి వైసీపీ, వైపు కొందరూ వెళ్తే, వైసీపీ నుంచి టీడీపీలోకి కొందరు వలసలు వస్తున్నారు.
చీరాల ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా గెలిచి తరువాత తెలుగు దేశం పార్టీలో చేరిన ఆమంచి కృష్ణ మోహన్ ఎన్నికల ముందు పార్టీ మారడానికి రెడీ అయ్యారు.ఆ మధ్య వైసీపీలో చేరుతారని ఊహాగానాలు వినిపించాయి.
అయితే చంద్రబాబుతో అకస్మాత్తుగా బేటీ కావడం ద్వారా అతను తన నిర్ణయం మార్చుకున్నారని టాక్ వినిపించింది.
ఇదిలా వుంటే తాజాగా చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ మోహన్ టీడీపీ పార్టీకి అధికారికంగా రాజీనామా లేఖని సమర్పించారు.
లేఖ అందించిన తర్వాత లోటస్ ఫండ్ లో వైసీపీ అధినేత జగన్ తో బేటీ కావడం జరిగింది.అనంతరం మీడియా ముందుకి వచ్చిన ఆమంచి త్వరలో అధికారికంగా వైసీపీలో చేరబోతున్నట్లు స్పష్టం చేసారు.
కార్యకర్తల అబీస్టం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమంచి తెలియజేసారు.అయితే ఆమంచికి చీరాల సీటు కన్ఫర్మ్ చేయడం వలెనే అతను వైసీపీలో చేరినట్లు రాజకీయ వర్గాలలో వినిపిస్తుంది.