టాలీవుడ్ హీరోయిన్ ఛార్మి గురించి ప్రత్యేకం గా పరిచయం చేయనక్కర్లేదు.సీనియర్ స్టార్ హీరోలతో పాటు యంగ్ స్టార్ హీరో లతో కూడా ఈమె నటించి మెప్పించింది.
నితిన్ నటించిన శ్రీ ఆంజనేయం సినిమా లో అందాల ఆరబోత చేసి టాలీవుడ్ దృష్టిని ఆకర్షించిన చార్మి ఆ తర్వాత వరుసగా పెద్ద చిన్న అనే తేడా లేకుండా పదుల కొద్ది సినిమాలను చేసింది.హీరోయిన్ గానే కాకుండా మంచి ప్రత్యేక పాటలను, అంటే ఐటమ్ సాంగ్స్ ని కూడా చేసింది.
లేడీ ఓరియంటెడ్ సినిమా లతో ఈ అమ్మడి యొక్క పేరు మరింతగా మారు మోగింది.టాలీవుడ్ లో మాత్రమే కాకుండా ఈమె కు ఇతర భాషల్లో కూడా మంచి పేరు అయితే లభించింది.
నటి గా అవకాశాలు వస్తున్న సమయం లోనే నిర్మాణం పై ఉన్న ఆసక్తి నేపథ్యం లో పూరి జగన్నాథ్ నిర్మాణ సంస్థలు చేరింది.ఆయన తో కలిసి సినిమా లను నిర్మించింది.
సహ నిర్మాత గా వ్యవహరిస్తూ సినిమాల నిర్మాణం పట్ల ఒక అవగాహనకు ఆమె వచ్చింది.
ఎన్నో సినిమాల నిర్మాణం లో భాగస్వామి గా వ్యవహరించిన చార్మి ఇటీవల లైగర్ సినిమా కు మెయిన్ నిర్మాత గా కూడా వ్యవహరించింది.లైగర్ సినిమా దారుణమైన పరాజయం మూట కట్టుకుంది.ఆ సినిమా కలెక్షన్స్ పరం గా డిజాస్టర్ అని తేలి పోయింది.
దాంతో చార్మి మరియు పూరి ల యొక్క కష్టాలు మరింతగా పెరిగాయి అంటూ ప్రచారం జరుగుతోంది.ఈ సమయం లో చార్మి మళ్ళీ నటన వైపు ఆకర్షితురాలు అవుతుంది అంటూ టాలీవుడ్ లో ప్రచారం జరుగుతుంది.
గత కొన్ని రోజులుగా ఆమె నటన పట్ల తాను ఆసక్తిగా లేను అంటూ చెబుతూ వచ్చింది.కానీ నిర్మాత గా సక్సెస్ అవ్వలేక పోవడం తో తప్పని పరిస్థితుల్లో మళ్లీ నటన వైపు అడుగులు వేయాల్సి వస్తుందేమో అంటూ ఆమె అభిమానులు భావిస్తున్నారు.
చార్మి మళ్ళీ నటిస్తే తమకు సంతోషమే అన్నట్లు ఫ్యాన్స్ సోషల్ మీడియా లో మాట్లాడుకుంటున్నారు.నిజంగానే మళ్లీ నటన వైపు.ప్రత్యేక సాంగ్స్ వైపు ఆకర్షితురాలు అవుతుందా అనేది చూడాలి.