హైదరాబాద్ లో ఉద్రిక్తత , విద్యార్ధి మృతి ?

నిత్యం ఉద్రిక్త వాతావరణానికి కేంద్ర బిందువుగా మారుతున్న హైదరాబాదులోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో నేటి ఉదయం మరోమారు హైటెన్షన్ వాతావరణం చోటుచేసుకుంది.

వర్సిటీలోని వాటర్ ట్యాంకులో పడి ఓ యువకుడు మృతి చెందాడు.

సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వాటర్ ట్యాంకులో పడి ఉన్న సదరు యువకుడి మృతదేహాన్ని వెలికి తీశారు.ఆ తర్వాత అతడు మాణికేశ్వరి నగర్ కు చెందిన ప్రసాద్ గా గుర్తించారు.

యువకుడు ఏ కారణంగా చనిపోయాడన్న విషయం తెలియరాలేదు.దీనిపై వర్సిటీలో కలకలం రేగింది.

యువకుడి మృతదేహం వద్దకు చేరుకుంటున్న ఓయూ విద్యార్థుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది.దీంతో పరిస్థితి అదుపులోనే ఉంచేందుకంటూ పోలీసులు కూడా భారీ సంఖ్యలో అక్కడ మోహరించారు.

Advertisement

ఈ నేపథ్యంలో అక్కడ హైటెన్షన్ వాతావరణం చోటుచేసుకుంది.

ఈ మాజీ ముఖ్యమంత్రుల పిల్లలందరు ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటేనా ?
Advertisement

తాజా వార్తలు