ఈనెల 5వ తారీఖున తూర్పుగోదావరి జిల్లాలో చంద్రబాబు పర్యటన..!!

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు( N Chandrababu Naidu ) ఈనెల 5వ తారీఖున తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు.అకాల వర్షాలు కారణంగా.

 Chandrababu's Visit To East Godavari District On 5th Of This Month , Tdp , Cha-TeluguStop.com

నష్టపోయిన పంటలను పరిశీలించడానికి రెడీ అయ్యారు.ఈ క్రమంలో రామచంద్రాపురం, కడియం మండలాల్లోని గ్రామాల్లో చంద్రబాబు పర్యటించనున్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వేసవికాలంలో అకాల వర్షాలు పడుతున్న సంగతి తెలిసిందే.భారీ వర్షాలు కారణంగా పలు జిల్లాలు జలదిగ్బంధంలో చిక్కుకుంటున్నాయి.

అకాల వర్షాలతో సాధారణ ప్రజలతోపాటు రైతులు.తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఈ వర్షాల కారణంగా పలు పంటలు కూడా నష్టపోవడం జరిగింది.

దీంతో ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఈనెల 5వ తారీఖున తూర్పుగోదావరి జిల్లాలో పాడైపోయిన పంటలను పరిశీలించి… నష్టపోయిన రైతులను పరామర్శించడానికి రెడీ అయ్యారు.రైతులను ప్రభుత్వం( Farmers ) ఆదుకునే దిశగా చంద్రబాబు ఒత్తిడి తీసుకొచ్చే రీతిలో ఈ పర్యటన చేపడుతున్నట్లు టీడీపీ పార్టీ నేతలు తెలియజేస్తూ ఉన్నారు.అకాల వర్షాల కారణంగా చాలామంది రైతులు నష్టపోవడంతో.

వారందరిని ప్రభుత్వమే ఆదుకోవాలని టీడీపీ( TDP ) డిమాండ్ చేస్తూ ఉంది.దాదాపు వారం రోజులకు పైగానే రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి.

ఈ వర్షాలకు పలు జిల్లాలు జలదిగ్బంధంలో చిక్కుకోవడం జరిగింది.దీంతో ప్రభుత్వ అధికారులు కూడా.

ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.మరోపక్క అకాల వర్షాల కారణంగా తడిసిపోయిన ధాన్యం కొనుగోలుకు పౌరసరఫరాల శాఖ అధికారులు చర్యలు చేపట్టే రీతిలో ఏపీ ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు సమాచారం.

ఇటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు పర్యటన ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube