తెలుగు ప్రజలకు జైలు నుంచి చంద్రబాబు బహిరంగ లేఖ

రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు తెలుగు ప్రజలకు బహిరంగ లేఖ రాశారు.తాను జైలులో లేనన్న ఆయన ప్రజల హృదయాల్లో ఉన్నానని తెలిపారు.

 Chandrababu's Open Letter To The Telugu People From Jail-TeluguStop.com

ప్రజల నుంచి తనను ఎవరూ దూరం చేయలేరని చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు.45 ఏళ్లుగా తాను కాపాడుకుంటూ వస్తున్న విలువలు, విశ్వసతీయతను చేరిపేయలేరని తెలిపారు.ఆలస్యమైనా న్యాయం గెలుస్తుందని చెప్పారు.తాను త్వరలోనే బయటకు వస్తానన్న చంద్రబాబు ప్రజలు, రాష్ట్ర ప్రగతి కోసం రెట్టించిన ఉత్సాహంతో పని చేస్తానని వెల్లడించారు.ఓటమి భయంతో జైలు గోడల మధ్య బంధించి ప్రజలను తనను దూరం చేశామనుకుంటున్నారు.కానీ అభివృద్ధి రూపంలో ప్రతీ చోట కనిపిస్తూనే ఉంటానని చెప్పారు.

ప్రజలే తన కుటుంబమని, జైలు గోడల మధ్య కూర్చుని ఆలోచిస్తుంటే 45 ఏళ్ల ప్రజా జీవితం తన కళ్ల ముందు కదలాడుతోందని తెలిపారు.కుట్రలతో తనపై అవినీతి ముద్ర వేయాలని ప్రయత్నించారని ఆరోపించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube