ఇళ్లు లేని పేదలకు రాజధాని భూముల్లో నివాస గృహాలు ఇవ్వాలని జగన్ మోహన్ రెడ్డి అనుకుంటుంటే చంద్రబాబు నాయుడు అడ్డు కుంటుంన్నారని మంత్రి రజని అన్నారు .చిలకలూరిపేట మండలం పసుమర్రు లో జగనన్న కాలని కి మంత్రి రజని శంకుస్థాపన చేసారు .
ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 32 లక్షల ఇళ్ల పట్టాలు జగనన్న ఇప్పటికే ఇచ్చారని అన్నారు .ఇంకా ఇళ్లు లేని పేదలకు రాజధానిలో ఉన్న భూముల్లో ఇళ్లు ఇవ్వాలని చూస్తున్నారని ఆప్రయత్నాన్ని చంద్రబాబు గతంలోనూ అడ్డుకున్నారని ఇప్పుడు అడ్డుకుంటున్నారని అన్నారు .చంద్రబాబు ప్రభుత్వం మాటల ప్రభుత్వం అని మాది చేతల ప్రభుత్వం అని అన్నారు .