నేడు గుంటూరులో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటించనున్నారు.ఉయ్యూరు ట్రస్ట్ ఆధ్వర్యంలో పేదవాళ్లకు జనతా వస్త్రాలు మరియు సంక్రాంతి కానుక పంపిణీ చేయనున్నారు.
చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్రవ్యాప్తంగా చంద్రన్న సంక్రాంతి కానుక పేరిట పేదలకు నిత్యవసర సరుకులను పంపిణీ చేసేవారు.అయితే ఆ తర్వాత ప్రభుత్వం మారటంతో ఈ పథకం ఆగిపోయింది.
పరిస్థితి ఇలా ఉంటే అధికారంలో ఉన్న లేకపోయినా పేదలు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో దీనిని తిరిగి కొనసాగించాలని తెలుగుదేశం పార్టీ భావించడం జరిగింది.
ఈ సందర్భంగా గుంటూరు సదాశివనగర్లో వికాస్ హాస్టల్ మైదానంలో నేడు 30 వేల మందికి సంక్రాంతి కానుకతో పాటు జనతా వస్త్రాలు చంద్రబాబు పంపిణీ చేయనున్నారు.
ఈరోజు సాయంత్రం గుంటూరులో ఈ కార్యక్రమంలో నిర్వహించిన తర్వాత ఐదున్నర గంటలకు బహిరంగ సభలో ప్రసంగించనున్నారు.చంద్రబాబు పర్యటన నేపథ్యంలో.పైగా నూతన సంవత్సరం కావటంతో గుంటూరు జిల్లా టీడీపీ కీలక నేతలు… భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.