తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు( TDP Chandrababu Naidu )/em> కొద్దిసేపటి క్రితమే ఢిల్లీ చేరుకున్నారు.గురువారం రాత్రి కేంద్ర హోం మంత్రి అమిత్ షా( Minister Amit Shah )తో భేటీ కానున్నారు.
ఆ తర్వాత జేపీ నడ్డా సహా ఇతర బీజేపీ అగ్ర నాయకులను కూడా కలవనున్నారు.ఏపీలో టీడీపీ జనసేన కూటమి( TDP Janasena )తో బీజేపీ కూడా చేతులు కలపటమే ఉద్దేశంగా చంద్రబాబు పర్యటన సాగుతోంది.
ఆల్రెడీ ఫిబ్రవరి ప్రారంభంలో ఢిల్లీలో అమిత్ షా తో పాటు జేపీ నడ్డాతో పొత్తు విషయంలో చంద్రబాబు మంతనాలు జరపడం జరిగింది.నేడు మరోసారి ఏపీలో పొత్తులపై చర్చలు జరుపుతున్నారు.
ఈసారి స్పష్టత రాబోతున్నట్లు సమాచారం.నడ్డాను కలిసిన అనంతరం పొత్తులపై ప్రకటన వెలువడే అవకాశం ఉందట.
2024 ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా వ్యవహాత్మకంగా చంద్రబాబు నిర్ణయాలు తీసుకుంటున్నారు.ఎట్టి పరిస్థితులలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చిలిపోకుండా జాగ్రత్తలు పడుతున్నారు.ఆల్రెడీ జనసేన పార్టీతో పొత్తులో ఉన్న టీడీపీ… బీజేపీ( BJP )ని కూడా కలుపుకొని పోవటానికి సిద్ధపడుతోంది.ఈ క్రమంలో ఎప్పటినుండే ప్రయత్నాలు చేస్తుండగా సరిగ్గా ఎన్నికలకు ముందు ఆ ప్రయత్నాలు సఫలీకృతం అయ్యే దిశగా సాగుతున్నాయి.2014 ఎన్నికలలో గెలిచినట్టు 2024 ఎన్నికలలో గెలవాలని చంద్రబాబు భావిస్తున్నారు.2014లో రాష్ట్ర విభజన జరిగినా అనంతరం ఏపీలో టీడీపీ-బీజేపీ-జనసేన కూటమి( TDP BJP Janasena Alliance )గా ఏర్పడ్డాయి.ఆ సమయంలో జరిగిన ఎన్నికలలో ఈ కూటమి అధికారంలోకి రావడం జరిగింది.ఇప్పుడు అదే విధంగా.గెలవాలని చంద్రబాబు ఆలోచన.దీంతో ఢిల్లీ( Delhi )లో బీజేపీ పెద్దలతో సీట్ల విషయంలో ఇంకా అనేక విషయాలలో చర్చలు జరుపుతున్నారు.