గురువారం విజయవాడలో వ్యూహం( Vyuham ), శపథం సినిమాలపై ఆర్జీవి( RGV ) ప్రెస్ మీట్ నిర్వహించారు.ఈ సందర్భంగా జగన్ ప్రభుత్వం పై ఆర్జీవి ప్రశంసలు వర్షం కురిపించారు.
సినిమాలో జగన్( YS Jagan ) పై తనకున్న అభిప్రాయాన్ని మాత్రమే చూపించినట్లు పేర్కొన్నారు.ఇదిలాఉండగా సినిమాలో తాను చేయని రీతిలో రాజకీయాల్లో వైసీపీ నాయకులు అతి చేస్తున్నారు.
అంటూ పవన్( Pawan Kalyan ) కామెంట్లను మీడియా ప్రతినిధులు ఆర్జీవి వద్ద ప్రస్తావించారు.ఈ కామెంట్లకు రాంగోపాల్ వర్మ స్పందిస్తూ.
ప్రతిసారి జగన్ బ్రష్టు పట్టించాడు, సైకో, బాబాయ్ నీ చంపేశాడు అంటూ నిరాధారమైన ఆరోపణలు చేయడం తప్ప పవన్ కళ్యాణ్ అసలు విషయం చెప్పడు.ఈ ఆరోపణలపై వాళ్ళ అభిమానులు కూడా ఎవరు అడగరు.
వైసీపీ ప్రభుత్వం( YCP Govt )లో జరిగిన అభివృద్ధిపై ఎక్కడైనా చర్చకు సిద్ధమని సవాల్ చేశారు.మొన్ననే వ్యూహం సినిమా థియేటర్ లో రిలీజ్ అవ్వగా. శపథం సినిమా( Shapadam ) మార్చి 8వ తారీకు నుండి.ఏపీ ఫైబర్ నెట్ లో స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు స్పష్టం చేయడం జరిగింది.ఎలక్షన్స్ సమయంలో రామ్ గోపాల్ వర్మ( Ram Gopal Varma ) తెరకెక్కించిన ఈ చిత్రాలు ఏపీ రాజకీయాలలో( AP Politics ) సంచలనంగా మారాయి.వైయస్ రాజశేఖర్ రెడ్డి మరణించిన అనంతరం రాజకీయంగా జగన్ ఎదుర్కొన్న సమస్యలు ఆయన ముఖ్యమంత్రి అయిన విధానం వంటి విషయాలను ఆధారం చేసుకుని ఆర్జీవి ఈ సినిమాలు చిత్రీకరించడం జరిగింది.