కరోనా విషయంలో చంద్రబాబు మళ్లీ అవే ఆరోపణలు

ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలో కరోనా ప్రభావంను తగ్గించి చూపిస్తుందనే ఆరోపణలు గతంలో మాజీ సీఎం చంద్రబాబు చేసిన విషయం తెల్సిందే.

పెద్ద ఎత్తున రాష్ట్రంలో కేసులు నమోదు అవుతున్నా కూడా కావాలని ఉద్దేశ్య పూర్వకంగానే రాష్ట్రంలో కరోనా మరణాలను ఇంకా కేసులను తగ్గించి చూపిస్తున్నారు అంటూ మరోసారి చంద్రబాబు నాయుడు ఆరోపించారు.

తాజాగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ప్రభుత్వం కరోనా విషయంలో నిజాలు దాస్తుందని, ఇది చాలా ప్రమాదకరం అంటూ ఆయన అన్నారు.తాజాగా ప్రధాని నరేంద్ర మోడీతో మీటింగ్‌లో కూడా ఉద్దేశ్య పూర్వకంగానే జగన్‌ ప్రభుత్వం కరోనా ప్రభావం రాష్ట్రంలో తక్కువగా ఉందని చెప్పాడంటూ బాబు ఆరోపించారు.

ఒకటి రెండు జిల్లాల్లో పరిస్థితి బాగున్నంత మాత్రాన రాష్ట్ర వ్యాప్తంగా లాక్‌డౌన్‌ను ఎత్తివేయడం లేదంటే సడలించడం ఏమాత్రం సరి కాదని బాబు అన్నాడు.ఇలాంటి పరిస్థితుల్లో నిజాలు దాయడం వల్ల తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని బాబు హెచ్చరించాడు.

.

Advertisement
వైసీపీ సీనియర్ల చూపు ఆ పార్టీ పై పడిందా ? 

తాజా వార్తలు