వైసీపీ అధినేత జగన్ దాదాపు ఏడాదిపాటు సుదీర్ఘ పాదయాత్ర చేపట్టాడు.ఈ యాత్రలో మూడొంతులకుపైగా నియోజకవర్గాలను టచ్ చేస్తూ… జగన్ యాత్ర చేసాడు.
పులివెందులలో మొదలు పెట్టిన యాత్ర …శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురం వరకు సాగింది.ఈ యాత్రలో జగన్ ప్రభుత్వం మీద అనేక విమర్శలు చేసిన సంగతి కూడా తెలిసిందే.
అయితే ఇప్పుడు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకి ఓ కొత్త డౌట్ వచ్చింది.అసలు జగన్ చేసింది పాదయాత్ర …విహారయాత్రా అని.

ప్రతి వారం ఆయన ఇంటికి వెళ్లారని, కాబట్టి … ఇది ఫ్యాన్సీ యాత్ర అని బాబు విమర్శించారు.అంతే కాకుండా ఈ యాత్రకు పవిత్రత లేదని చంద్రబాబు వ్యాఖ్యానించారు.రాత్రి ఏడు గంటల తర్వాత జగన్ పాదయాత్ర చేయలేదని ఆయన అన్నారు.రోజూ ఎనిమిది కిలోమీటర్లే పాదయాత్ర చేశారని ఆయన అన్నారు.