తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మరుగుదొడ్ల నిర్మాణాల్లో అవకతవకలు జరిగాయని టీడీపీ ఎమ్మెల్యే డోలా బాల వీరాంజనేయ స్వామి( Bala Veeranjaneya Swamy) పై చర్యలు తీసుకోవాలని కోరుతూ వైసిపి నేతలు ఎమ్మెల్యే ఇంటి ముట్టడికి ప్రయత్నించారు.దీంతో ప్రకాశం జిల్లా కొండపి నియోజకవర్గంలో తీవ్ర ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది.
ఇదే సమయంలో వైసీపీ తీరును నిరసిస్తూ ఎమ్మెల్యే డోలా వీరాంజనేయ స్వామి ఆధ్వర్యంలో టీడీపీ కార్యకర్తలు వైసీపీ ఇన్చార్జి వరికుట్టి అశోక్ బాబు ఇంటి ముట్టడికి బయలుదేరారు.ఈ క్రమంలో మార్గ మధ్యలోనే పోలీసులు తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులను.
కార్యకర్తలను అడ్డుకోవడంతో ఎమ్మెల్యే పోలీసుల తీరును నిరసిస్తూ రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.వెంటనే పోలీసులు ఎమ్మెల్యేని అదుపులోకి తీసుకోవడం జరిగింది.
ఈ పరిణామంపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు( Chandrababu naidu ) తీవ్ర స్థాయిలో సోషల్ మీడియాలో మండిపడ్డారు.“కొండపి ఎమ్మెల్యే డోలా బాల వీరాంజనేయ స్వామి గారిపై వైసీపీ ప్రభుత్వ( YCP ) కక్ష సాధింపు చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నా.నాడు అసెంబ్లీలో దాడి నుంచి నేటి అక్రమ అరెస్టు వరకు….ప్రతి చర్య దళిత నాయకుడైన స్వామి గొంతు నొక్కేందుకు ఈ ప్రభుత్వం చేస్తున్న కుట్రే.తమ పట్ల వైసీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న అహంకార ధోరణిని దళిత సమాజం గమనిస్తోంది.మీకు బుద్ది చెప్పడానికి సిద్దం అయ్యింది.
నా సోదరుడు స్వామి మీ అక్రమ అరెస్టులకు, వేధింపులకు భయపడే నేత కాదు.ఎదిరించి పోరాడే నాయకుడు.
పోలీసులు వైసీపీ క్రియాశీల కార్యకర్తల్లా కాకుండా… చట్టబద్దంగా వ్యవహరించాలి.వెంటనే స్వామిని విడుదల చేయాలి”.
అని చంద్రబాబు కోరడం జరిగింది.