" ఎన్ని కోట్లు ఇచ్చినా చంద్రబాబు నన్ను కొనలేడు "

అవినీతి సొమ్ముతో ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్న తెలుగుదేశం పార్టీ, ఎన్ని కోట్లిచ్చినా తనను మాత్రం చంద్రబాబు కొనలేరని మార్కాపురం ఎమ్మెల్యే, వైకాపా నేత జంకె వెంకటరెడ్డి వ్యాఖ్యానించారు.రాజంపల్లి తిరునాళ్లలో వైకాపా ఆధ్వర్యంలో ఏర్పాటైన ప్రభపై మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డితో కలసి కనిపించిన ఆయన ప్రసంగిస్తూ, యువనేత జగన్ ముఖ్యమంత్రి అయితే వైఎస్ఆర్ రామరాజ్యం వస్తుందని అన్నారు.

 Chandrababu Cant Buy Me With Crores-TeluguStop.com

వెలిగొండ ప్రాజెక్టుకు వచ్చి చూసి వెళ్లడం తప్ప చంద్రబాబు మరేమీ చేయలేదని విమర్శించారు.బాబుకు ఓటు వేసిన వారు ఇప్పుడు చింతిస్తున్నారని అన్నారు.

కరవుతో రైతులు, ఉద్యోగాలు లేక యువత, ఉపాధి లేక కూలీలు బాధపడుతున్నారని, ఎమ్మెల్యేలకు ఇవ్వాల్సిన నిధులను సైతం చంద్రబాబు సర్కారు పక్కదారి పట్టించిందని ఆరోపించారు.రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకెళ్లాలన్నా, రైతులు సుఖంగా ఉండాలన్నా జగన్ ముఖ్యమంత్రి కావాల్సిందేనని వెంకటరెడ్డి అభిప్రాయపడ్డారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube