2023లో తుదిశ్వాస విడిచి అభిమానులకు కన్నీళ్లను మిగిల్చిన సెలబ్రిటీలు వీళ్లే!

2023 సంవత్సరానికి తెలుగు రాష్ట్రాల ప్రజలు గుడ్ బై చెప్పడానికి మరో 50 రోజుల సమయం మాత్రమే ఉంది.ఈ ఏడాది సినిమా ఇండస్ట్రీకి కొన్ని తీపి జ్ఞాపకాలు మిగిలితే ఎక్కువ సంఖ్యలో చేదు జ్ఞాపకాలు మిగిలాయి.

ఈ ఏడాది హిట్టైన సినిమాలను వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు.2023లో తుదిశ్వాస విడిచి అభిమానులకు కన్నీళ్లను మిగిల్చిన సెలబ్రిటీలు ఎక్కువ సంఖ్యలోనే ఉన్నారు.నిన్న ప్రముఖ నటుడు చంద్రమోహన్ ( Chandramohan )గుండె, కిడ్నీ సంబంధిత సమస్యలతో మృతి చెందిన సంగతి తెలిసిందే.

చంద్రమోహన్ మరణం ఆయన ఫ్యాన్స్ ను ఎంతగానో బాధపెట్టింది.ప్రముఖ టాలీవుడ్ నటుడు తారకరత్న( Tarakaratna ) ఈ ఏడాది ఫిబ్రవరి నెల 18వ తేదీన మృతి చెందారు.

ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్, నటుడు, అవార్డ్ గ్రహీత కె.విశ్వనాథ్( K.Vishwanath ) ఈ ఏడాది ఫిబ్రవరి నెల 2వ తేదీన తుదిశ్వాస విడిచి అభిమానులకు బాధను మిగిల్చారు.

ప్రముఖ టాలీవుడ్ నటి జమున( Actress Jamuna ) ఈ ఏడాది జనవరి నెల 27వ తేదీన మృతి చెందారు.ప్రముఖ నటుడు శరత్ కుమార్( Sarath Kumar ) ఈ ఏడాది మే నెల 22వ తేదీన కన్నుమూశారు.ఆర్.ఆర్.ఆర్ సినిమాలో విలన్ గా నటించిన రే స్టీవెన్సన్‌ కూడా మే 22వ తేదీన మృతి చెందారు.ప్రముఖ సంగీత దర్శకుడు రాజ్, తమిళ నటుడు మనోబాల, బాలీవుడ్ దర్శకుడు, నటుడు సతీష్ కౌశిక్, తమిళ హాస్య నటుడు మయిల్ స్వామి, ప్రముఖ నేపథ్య గాయని వాణీ జయరామ్ ఈ ఏడాది మృతి చెంది బాధను మిగిల్చారు.

Advertisement

దర్శకుడు సాగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ శ్రీనివాసమూర్తి, స్టంట్ మాస్టర్ జూడో కేకే రత్నం, పాపులర్ రైటర్ బాల మురుగన్ ఈ ఏడాది మృతి చెందారు.ప్రముఖ సెలబ్రిటీలు మృతి చెందడం ఫ్యాన్స్ ఎంతగానో బాధ పెడుతోంది.ఈ సెలబ్రిటీలు భౌతికంగా మరణించినా ఫ్యాన్స్ హృదయాల్లో మాత్రం జీవించి ఉన్నారు.

వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 
Advertisement

తాజా వార్తలు