విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయంలో పునరాలోచన లేదని కేంద్రం మరోసారి స్పష్టం చేసింది.రాజ్యసభలో ఎంపీ కనకమేడల అడిగిన ప్రశ్నకు కేంద్రం సమాధానం ఇచ్చింది.
ఈ మేరకు ఉద్యోగ, కార్మిక సంఘాలతో స్టీల్ ప్లాంట్ యాజమాన్యం చర్చలు జరుపుతోందని కేంద్రం తెలిపింది.స్టీల్ ప్లాంట్ పై తీసుకున్న నిర్ణయాన్ని పున: పరిశీలించే ప్రతిపాదన లేదని తేల్చి చెప్పింది.







