కేంద్రంపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.కేంద్రం రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతోందని ఆరోపించారు.
ప్రజా ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేంద్రం ఆర్డినెన్స్ తెచ్చిందని కేజ్రీవాల్ మండిపడ్డారు.ప్రభుత్వ అధికారుల విషయంలో ఢిల్లీ ప్రభుత్వానికి అధికారాలు లేకుండా చేస్తోందన్నారు.
కేంద్రం తీసుకువచ్చిన ఆర్డినెన్స్ ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగిస్తుందని తెలిపారు.సుప్రీం కోర్టు తీర్పును కూడా లెక్క చేయకపోతే ఇంక ఎక్కడికి వెళ్లాలని ప్రశ్నించారు.