దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పిఎఫ్ఐపై కేంద్రం నిషేధం విధించింది.ఈ మేరకు పిఎఫ్ఐని చట్ట వ్యతిరేక సంస్థగా గుర్తిస్తూ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది.
పిఎఫ్ఐతో పాటు దాని అనుబంధ సంస్థలపై ఐదేళ్లపాటు నిషేధాజ్ఞలు అమల్లో ఉంటాయి.ఎన్ఐఏ నిర్వహించిన దాడుల్లో పిఎఫ్ఐ ఉగ్రవాద లింకులు బయటపడ్డాయి.
ఈ క్రమంలో దేశవ్యాప్తంగా ఎన్ఐఏ దాడులు చేసిన తర్వాత కేంద్రం పిఎఫ్ఐను నిషేధిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.