ఏపీలో గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగులపై నమోదైన కేసులు ఎత్తివేతకు వైసిపి ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది.ఉద్యోగులపై నమోదైన ఏసీబీ కేసుల ఎత్తి వేసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.2014-19 మధ్యకాలంలో ఉద్దేశపూర్వకంగా కొంతమంది ఉద్యోగులపై కేసులు నమోదు చేసినట్లు వైసీపీ ప్రభుత్వానికి వినతులు వచ్చాయి.ఈ నేపథ్యంలో ఏసీబీ ట్రాప్ కేసులు కాకుండా మిగతా కేసుల్లో న్యాయం చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఈ మేరకు కేసులు ఎత్తివేత పై నిర్ణయం తీసుకునేందుకు ఓ కమిటీని నియమించింది.