ఏపీలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆడిట్ ఉద్యోగులు సమ్మెకు పిలుపునిచ్చారు.తమకు కేటగిరీల వారీగా గ్రేడింగ్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
ఈ మేరకు పలు డిమాండ్లతో కూడిన సమ్మె నోటీసును ఉద్యోగులు అంతా కలిసి డైరెక్టర్ కు అందజేశారు.జిల్లాల విభజనకు ముందున్న విధంగా డివిజన్ ఆఫీసులో ఏర్పాటు చేయాలని కోరారు.
అదేవిధంగా పాత విధానంలోనే వర్క్ అలాట్మెంట్ ఉండాలని డిమాండ్ చేశారు.