మనదేశంలో అత్యంత చౌకైన ప్రయాణంగా రైలు ప్రయాణం( Train Journey )ను చెప్పుకోవచ్చు.దీనికి కారణం తక్కువ ఛార్జీలతో సుదూర దూరాలను కూడా మనం గమ్య స్థానాలకు చేరుకోవచ్చు.
ఇక రైలు ప్రయాణించడానికి సాధరన భోగిల్లో ప్రయాణించుటకు రైల్వే స్టేషన్లో టికెట్లు తీసుకోవాలి.ఒకవేళ అదే రిజర్వేషన్ చేయించుకొని అందులో ప్రయాణించాలంటే.
ఆన్లైన్లో మనకు కావాల్సిన సమయానికి కావాల్సిన రైలుకి టికెట్లను బుక్ చేసుకొని ప్రయాణాన్ని సుఖవంతంగా చేసుకోవచ్చు.కొన్నిసార్లు జనరల్ రైలు( General Train ) కోసం ప్లాట్ఫామ్ కు చేరిన సమయంలో కంపార్ట్మెంట్లో నిలబడటానికి కూడా స్థలం ఉండకపోవడం అనేకసార్లు చూసే ఉంటాం.
ఈ సమయంలో కొందరు జనరల్ టికెట్( General Ticket ) తీసుకొని స్లీపర్ క్లాస్ లో ప్రయాణించడానికి ప్రయత్నిస్తుంటారు.అలా చేసిన సమయంలో టికెట్ కలెక్టర్ వచ్చి జరిమానా వసూలు చేయడం కూడా సాధారణంగా చూసే ఉంటారు.ఇకపోతే అసలు ఇలా జనరల్ టికెట్ తీసుకొని ప్రయాణించడం సాధ్యమా లేదా అన్న విషయం ఒకసారి చూస్తే.రైల్వే రూల్స్ ప్రకారం కొన్ని రైల్వే రూల్స్( Railway Rules ) కు లోబడి సాధారణ టికెట్ పై రైల్వేలో స్లీపర్ కోచ్( Sleeper Coach ) లోకి ప్రవేశం ఉంది.
ఇందుకు సంబంధించి రైల్వే రూల్స్ 1989లో చేసిన నియమం ప్రకారం.మనం చేస్తున్న ప్రయాణం 199 కిలోమీటర్లు లేదా అంతకంటే తక్కువ అయితే సాధారణ టికెట్ చెల్లుబాటు మూడు గంటల సమయం వరకు ఉంటుంది.
అయితే మనం జనరల్ టికెట్ తీసుకొని రిజర్వేషన్ కోచ్( Reservation ) లో ఎక్కినప్పుడు ముందుగా మనము టికెట్ కలెక్టర్ ను కలిసి ఏవైనా సీట్స్ ఉన్నాయేమో గమనించి ఒకవేళ ఉంటే.స్లీపర్ క్లాస్ జనరల్ మధ్య ఉన్న వ్యత్యాసంతో ఉన్న రసీదుని అందజేస్తారు అందుకు సంబంధించి మనము పెనాల్టీ కట్టాల్సి ఉంటుంది.ఒకవేళ సీటు ఖాళీగా లేకుంటే మాత్రం తరువాతి స్టేషన్ వరకు ఇది మనల్ని అనుమతిస్తుంది.ఒకవేళ సీట్లు లేకపోయినా మనం జనరల్ లో కాకుండా స్లీపర్ క్లాస్ లో ప్రయాణం చేయాలంటే 250 రూపాయల జరిమానా కడితే మనకు ఓ రసీదు ఇస్తాడు.
దాన్ని మనం రైల్లో ప్రయాణించేటప్పుడు ఉంచుకోవాలి.