ఇప్పటికైనా కూడా ఏ సీజన్లో దొరికే పండ్లను ఆ సీజన్లో తింటేనే ఆరోగ్యానికి చాలా మంచిది.ఇక వేసవికాలంలో డ్రైఫ్రూట్స్ ఆహారంలో చేర్చుకోవాలి.
ఇవి పోషకాహార లోపాన్ని తీరుస్తాయి.అలాగే వీటిలో ముందుగా అత్తిపండ్ల గురించి మాట్లాడుకోవాలి.
భారత దేశంలో వీటిని శతాబ్దాలు ఉపయోగిస్తున్నారు.ప్రజలు వేసవిలో వీటిని ఎంతో ఉత్సాహంగా తీసుకుంటారు.
అయితే ఎండు అత్తిపండ్లను తీసుకోవడం వలన ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి.వీటి గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
ఎండు అత్తి పండ్ల( Figs )లో ముఖ్యమైన పోషకాలు ఉంటాయి.అయితే అవి ఆరోగ్యపరంగా చాలా మంచివి.

అలాగే వీటిలో ఫైబర్, పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ కె,Bj6 సమృద్ధిగా ఉంటాయి.అంతేకాకుండా అత్తి పళ్ళలో యాంటీ ఆక్సిడెంట్లు( Antioxidants ) కూడా ఉంటాయి.అయితే ఇది ఫ్రీ రాడికల్స్ తో పోరాడటానికి పనిచేస్తాయి.ఇక దీర్ఘ కాలిక వ్యాధుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తాయి.అంతేకాకుండా అత్తి పండ్లు సహజ చక్కెరలా కూడా ఉపయోగపడతాయి.ఎండు అత్తి పండ్లను ఒక రుచికరమైన పోషకమైన చిరుతిండిగా తీసుకోవచ్చు.
అయితే ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం వేసవిలో వీటిని తీసుకోవడం పరిమిత పరిమాణంలో ఉండాలి.ఎందుకంటే అంజీర్ పాడైపోయే పండు.
ఇవి వేడిని అస్సలు తట్టుకోలేవు.సహజ చక్కెర కిన్వ ప్రక్రియకు దారితీస్తుంది.
దీని కారణంగానే త్వరగా ఇవి పాడైపోతాయి.

అందుకే వేసవి సమయంలో అత్తి పండ్లను నిల్వ చేయడం కొంచెం కష్టమైన పని అని చెప్పవచ్చు.ఈ పండ్లలో ఫైబర్ అధికంగా ఉంటుంది.అయితే ఫైబర్ జీర్ణ క్రియకు ఉపయోగపడుతుంది.
కానీ ఎండాకాలంలో ఎండిన అంజీర పండ్లను ఎక్కువగా తీసుకోవడం వలన జీర్ణ సమస్యలు( Digestive problems ), విరోచనాలు ఎదురవుతాయి.వేసవికాలంలో ఎండిన అత్తి పండ్లను తీసుకోవడం కంటే దానికి బదులుగా తాజా అత్తి పండ్లను తీసుకోవడం లేదా ఇతర హైడ్రేటింగ్ పండ్లను తీసుకోవడం మంచిది.
వేసవికాలంలో ఎండు అత్తి పండ్లను తినాలనుకున్న వారు పరిమితంగా తినాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.