సుడిగాలి సుదీర్, యాంకర్ రష్మీ ల మధ్య ఏమీ లేదు అన్న విషయం అందరికి తెలిసిందే.కానీ ఆ ఇద్దరి మధ్య ఏదో ఉంది అనేలా క్రియేట్ చేసింది మల్లెమాల టీమ్.
ఇక ఎక్కడ చూసినా కూడా డీ జోడి పై ఎక్కువగా కౌంటర్లు వేయడంతో వారి మధ్య ఏదో ఉంది అన్న వార్తలకు మరింత ఆజ్యం పోసినట్లు అయ్యింది.ఇక ఇది ఇలా ఉంటే ఇటీవలే సుడిగాలి సుదీర్ జబర్దస్త్ నుంచి వెళ్లిపోయిన విషయం తెలిసిందే.
అయితే సుధీర్ జబర్దస్త్ వీడియో తర్వాత రష్మీ మీద సెటైర్లు వేయడం ఎక్కువ అయిపోయింది.నీ వల్లే అటు వెళ్లిపోయాడు మీరిద్దరూ కలిసి ప్లాన్ చేశారు కదా అంటూ.
స్టేజి మీద రష్మీ పై సెటైర్లు వేస్తున్నారు.ఇది ఇలా ఉంటే తాజాగా ఎక్స్ ట్రా జబర్దస్త్ కు సంబంధించిన ప్రోమో విడుదల చేయగా అందులో బుల్లెట్ భాస్కర్ తండ్రి ఏ రెచ్చిపోయారు.
అప్పుడప్పుడు స్పెషల్ ఈవెంట్ లలో,స్కిట్ లలో కనిపించి కొడుకు పై సెటైర్లు వేస్తూ బాగానే ఆకట్టుకున్నాడు.అలా అడపదడపా చేస్తూ చివరికి జబర్దస్త్ ఫ్యామిలీలో ఒకరిగా మారిపోయాడు బుల్లెట్ భాస్కర్ తండ్రి.
ఈ మధ్యకాలంలో వరుస స్కిట్ లలో లో కూడా నటిస్తున్నాడు.ఇదిలా ఉంటే తాజాగా జబర్దస్త్ సంబంధించిన ప్రోమో విడుదల కాగా అందులో బుల్లెట్ భాస్కర్ తండ్రి హైలెట్ అయ్యాడు.
చేసిన స్కిట్ లో ముసలోడు పెళ్లి చేసుకుంటే శోభనం అంటూ వెంట పడడం బాగానే ఉంది.అంతే కాకుండా సుదీర్ స్టైల్ లో రోహిణి కి ప్రపోజ్ చేశాడు బుల్లెట్ భాస్కర్ తండ్రి.
నువ్వు చస్తే నేను ఏడుస్తాను కాని నేను చెప్తే నువ్వు ఏడవద్దు అంటూ ఏదో అలా కవర్ చేసి ప్రపోజ్ చేశాడు.
అంత వరకు బాగానే ఉన్నప్పటికీ చివరి లో రష్మీ ని బాగా ఇబ్బంది పెట్టినట్లు తెలుస్తోంది.పదేపదే మీ స్టోరీ ఏంటో చెప్పండి అంటూ రష్మిని కార్నర్ చేసినట్టు అనిపిస్తుంది.అప్పుడు రష్మీ బుల్లెట్ భాస్కర్ స్టోరీలు చెప్పడం ఏంటి అని అడిగితే అప్పుడు రష్మీ బుల్లెట్ భాస్కర్ స్టోరీలు చెప్పడం ఏంటి అని అడిగితే ఆడి స్టోరీ తర్వాతలేండి ముందు మీ స్టోరీ చెప్పండి అనేశాడు.
అలా చూడకు విసిగించడం తో రష్మీ అగ్గిమీదగుగ్గిలం అయి తామిద్దరం కేవలం మంచి ఫ్రెండ్స్ అంతకుమించి ఏమీ లేదు అని అంటుంది.ఇందుకు సంబంధించిన ప్రోమో కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.