ఖమ్మం జిల్లా లో దారుణం,ఉపాధ్యాయుడి పై గుర్తు తెలియని దుండగులు దాడి

ఖమ్మం జిల్లా లో దారుణ ఘటన చోటుచేసుకుంది.

ఎవరో గుర్తు తెలియని దుండగులు ఒక ఉపాధ్యాయుడి పై దాడి చేసి గొంతు కోసి చంపేసిన ఘటన తీవ్ర సంచలనం సృష్టించింది.

దుమ్ముగూడెం మండలం లచ్చి గూడెం లో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది.పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం లచ్చిగూడెంలోని నాగన్నగుంపునకు చెందిన చిన్నరామకృష్ణ.

రామచంద్రునిపేట స్కూల్ కాంప్లెక్స్ పరిధిలో సీఆర్పీ(క్లస్టర్ రిసోర్స్ పర్సన్)‌గా పనిచేస్తున్నాడు.ఆదివారం రాత్రి భార్యాపిల్లలతో కలిసి నివసిస్తుండగా ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లోకి చొరబడి నేరుగా రామకృష్ణ వద్దకు వెళ్లి అతడి భార్య కళ్లెదుటే గొంతుకోసి పరారయ్యారు.

దీనితో వారిని అడ్డుకునేందుకు వచ్చిన భార్యపైనా దాడి కి పాల్పడినట్లు సమాచారం.తీవ్ర రక్తస్రావం కావడంతో రామకృష్ణ అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తుంది.

Advertisement

అయితే ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతుడి భార్య నుంచి పోలీసులు వివరాలు సేకరించారు.హత్యకు భూవివాదాలే కారణమై ఉండొచ్చని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు.

మరి ఈ ఘటనకు సంబందించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు