వరంగల్ లో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభకు గులాబీ బాస్, సీఎం కేసీఆర్ హాజరయ్యారు.బీఆర్ఎస్ అభ్యర్థికి మద్ధతుగా ప్రచారం నిర్వహించిన ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ ఉద్యమంలో కీలక ఘట్టాలకు వరంగల్ వేదికగా నిలిచిందని కేసీఆర్ అన్నారు.ఉద్యమ సమయంలో వరంగల్ లో అనేక పోరాటాలు చేశామన్నారు.
బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ కోసమన్న కేసీఆర్ యాభై ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఏం జరిగిందో చూశామని చెప్పారు.ఇందిరమ్మ రాజ్యం తెస్తామని కాంగ్రెస్ అంటోందన్నారు.
ఇందిరమ్మ రాజ్యంలో ఆకలి చావులు తప్ప ఏం లేదని చెప్పారు.ఇందిరమ్మ రాజ్యం బాగుంటే ఎన్టీఆర్ పార్టీ ఎందుకు పెట్టారని ప్రశ్నించారు.
తెలంగాణలో అభివృద్ధి, సంక్షేమం బీఆర్ఎస్ తోనే సాధ్యమని స్పష్టం చేశారు.