సోషల్ మీడియాలో వైరల్ అయ్యే కొన్ని వీడియోలు మనల్ని భయపడతాయి.మరికొన్ని నవ్విస్తాయి.
ఇంకొన్ని హార్ట్ టచింగ్ గా ఉండి మనసులను దోచేస్తాయి.సరిగ్గా ఇప్పుడు అలాంటి వీడియోనే వైరల్ గా మారింది.
ఈ వీడియోలో ఒక బాలుడు పక్షితో( boy with a bird ) తాను తింటున్న ఆహారాన్ని షేర్ చేసుకున్నాడు.అంతే కాదు పక్షి తన గిన్నె నుంచి అన్నం తింటూ ఉంటే అతడు బాగా సంతోషించాడు.
ఆ దృశ్యాన్ని చూసి ఎంతో ముచ్చట పడిన బాలుడు తన పెదవులపై చిరునవ్వులు కూడా చిందించాడు.
అతని ఆహారపు గిన్నెలో ఏవో తినదగిన ఆకులు, రసం, రైస్( Leaves, juice, rice ) ఉన్నాయి.అయితే పక్షి రైస్ తింటూ కనిపించింది.ఆ బాలుడు “ఇంకా ఆహారం కావాలా నీకు?” అంటూ తన చేతికి అతికిన మెతుకులను దాని ముందు ఉంచాడు.ఆ పక్షి ఎగిరిపోకుండా అతడి గిన్నె పైనే ఉండి చేతి మీద ఉన్న మెతుకులను తిన్నది.ఆ సమయంలో ఈ పిల్లోడు తెగ సంతోషించాడు.ఆ దృశ్యం చూసేందుకు చాలా బ్యూటిఫుల్ గా కనిపించింది.
@buitengebieden ట్విట్టర్ పేజీ ఈ వీడియోను షేర్ చేసింది.20 సెకన్ల నిడివిగల ఈ వీడియోకు ఇప్పటికే 15 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి.దీన్ని చూసి చాలామంది ఫిదా అవుతున్నారు.
ప్రతి ఒక్కరూ మూగజీవుల పట్ల ఇలానే దయ చూపిస్తే ఈ ప్రపంచం ఒక అందమైన ప్రదేశం అవుతుందని అన్నారు.జంతువుల పట్లనే కాకుండా నిస్సహాయక స్థితిలో ఉన్న మనుషుల పట్ల కూడా దయ చూపించాలని కోరారు.
ఈ హార్ట్ టచింగ్ వీడియోను మీరు కూడా చూసేయండి.