ఉత్తరాంధ్ర ప్రజలను కించపరిచేలా మాట్లాడితే ఇలాగే ఉంటుంది: బొత్స సత్యనారాయణ

నిన్న విశాక ఎయిర్ పోర్ట్ లో చంద్రబాబు ప్రవర్తించిన తీరు అయన ఈన్ని ఏండ్ల రాజకీయ జీవితానికి మాయని మచ్చలాగా ఉంటుందని బొత్స సత్యనారాయణ అన్నారు.

ఉత్తరంద్ర ప్రజలను మోసం చేసిన చంద్రబాబుకి చెప్పులతో కాకపోతే మరి దేనితో సమాధానం చెప్పుతారు.

నిన్న చంద్రబాబు నాయుడు వైసిపి నాయకులు నాపై కావాలనే చెప్పులు వేయించారు అన్నారు.దానికి సమాదానంగా వైసిపి అలాంటి చిల్లర రాజకీయాలు చెయ్యదు.

ఆ గొడవకు మా పార్టీ కి కాని మా పార్టీ నాయకులకు కార్యకర్తలకు ఎలాంటి సంబంధం లేదన్నారు.నిన్న వైజాగ్ ఎయిర్ పోర్ట్ లో జరిగిందే రాయలసీమ లోను జరుగుతుందన్నారు.

టిడిపి ముఖ్యనాయకుడు అయ్యాన పాత్రుడి కుమారుడి పెళ్లి కి వెళ్ళుతు చేసిన హడాహుడి తప్పా మరేది లేదన్నారు.చంద్రబాబు కావాలనే అల్లర్లు సృష్టించి, శాంతి భద్రతలను నాశనం చేస్తున్నారు.

Advertisement

పోలీస్ లు చెప్పిన వినకుండా ప్రజాయాత్ర చేస్తే ఈలాంటి పరిణామాలే ఎదురవుతాయి అన్నారు.చట్టాలు అనేవి అందరికి ఒకే విదంగా ఉంటాయి.

వాటిని ఉల్లంగిస్తే మాత్రం ఏ ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు అన్నారు.చంద్రబాబు కి కావలిసింది అయన సామజిక వర్గం తప్ప వెనకబడిన ప్రజలగురుంచి అవసరంలేదన్నారు.

Advertisement

తాజా వార్తలు