పండు నాకు కొడుకు లాంటి వాడంటున్న నాగబాబు... దాంతో బండ్ల గణేష్...

తెలుగులో ప్రముఖ ఎంటర్ టైన్ మెంట్ చానల్ అయినటువంటి జీ తెలుగులో ప్రతి ఆదివారం సాయంత్రం ప్రసారమయ్యే "బొమ్మ అదిరింది" కామెడీ షో సినీ ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుంటుందో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.

అయితే తే తాజాగా ఈ షో నిర్వాహకులు ఈ ఆదివారం ప్రసారమయ్యే ప్రోమోని యూట్యూబ్ లో విడుదల చేశారు.

అయితే ఈ ప్రోమోను ఒకసారి పరిశీలించినట్లయితే ఒకప్పటి ప్రముఖ కమెడియన్ మరియు ప్రముఖ సినీ నిర్మాత బండ్ల గణేష్ ముఖ్యఅతిథిగా వచ్చినట్లు తెలుస్తోంది.అయితే ఇందులో డ్యాన్స్ కొరియోగ్రాఫర్ పండు నాగబాబుని ఐ లవ్ యు డాడీ అని పిలవగా శ్రీముఖి పండు ని ఆట పట్టించింది.

 దీంతో నాగబాబు కలగజేసుకుంటూ పండు ని  అలా అనకని పండు నా కొడుకు లాంటి వాడని చెబుతాడు.దీంతో బండ్ల గణేష్ మీ కొడుకు ఇంత చండాలంగా ఎందుకు ఉంటాడన్న అంటూ ఫన్నీగా కామెంట్ చేస్తూ అందర్నీ నవ్వించాడు.

అలాగే ఇంకోసారి నా ముందు నాగబాబు గారిని డాడీ అన్నావంటే షో నుంచి వెళ్ళిపోతానని అంటూ పండు ని సరదాగా ఆట పట్టించాడు. ఆ తర్వాత సద్దాం గ్యాంగ్ బండ్ల గణేష్ ఫై  చేసినటువంటి స్కిట్ ప్రేక్షకులను ఎంతగానో అలరించింది.ఈ షో ప్రోమోని యూట్యూబ్ లో విడుదల చేసిన కొద్ది సమయంలోనే తొమ్మిది లక్షల పై చిలుకు వ్యూస్ వచ్చాయి.

Advertisement

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం బండ్ల గణేష్ తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ఓ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.

ఇంతకీ ఆ గోడ కట్టింది ఎవరు ? టీడీపీ వర్సెస్ వైసిపి
Advertisement

తాజా వార్తలు