హైదరాబాద్ లో బీజేపీ నేతలు, కార్యకర్తలు కదం తొక్కారు.తెలంగాణ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగగా నిరసనకు దిగారు.ఈ క్రమంలో అన్ని అనుబంధ మోర్చాలతో కలిపి ఏకకాలంలో బీజేపీ ముట్టడి కార్యక్రమానికి పిలుపునిచ్చింది.
317 జీవోకు వ్యతిరేకంగా ఉద్యోగులు చేస్తున్న పోరాటానికి బీజేపీ మద్ధతు ఇచ్చింది.ఇందులో భాగంగానే బీజేపీ ఓబీసీ మోర్చా నేత అలె భాస్కర్ ప్రగతిభవన్ ముట్టడికి యత్నించారు.దీంతో అప్రమత్తమైన పోలీసులు ఆందోళనకారులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.
మరోవైపు బీజేపీ కార్యాలయం ఎదుట భారీగా మోహరించారు.