రాజకీయ కక్ష సాధింపు కోసం ప్రభుత్వం జీవో – 1 జారీ చేసింది.యువగళం పాదయాత్ర పై జనవరి 9 న ప్రభుత్వానికి రూట్ మ్యాప్ ఇచ్చాం.
డీజీపీ తల,తోక లేని ప్రశ్నలు అడుగుతున్నారు.రాజ్యాంగం ప్రకారం పాదయాత్ర కు ఎలాంటి అనుమతి అవసరం లేదు.
సమాచారం ఇస్తే చాలు….అనుమతి అవసరం లేదని 1861 చట్టంలో ఉంది.
పాదయాత్ర కు అనుమతి అవసరం లేదని గతంలో వైసీపీ నేతలు వైవీ సుబ్బారెడ్డి,ధర్మాన కూడా చెప్పారు.ఏదొక కారణంతో పాదయాత్ర ఆపాలని చూస్తే జరిగే పరిణామాలకు ప్రభుత్వం బాధ్యత వహించాలి.
తుగ్లక్ ఆలోచనలు విరమించుకుని పాదయాత్ర కు అనుమతి ఇవ్వాలి.