తెలంగాణలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు రానున్న నేపథ్యంలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా బీజేపీ తీవ్ర కసరత్తు చేస్తుంది.ఈ క్రమంలోనే రాష్ట్రంపై ప్రత్యేక దృష్టి సారించిన కమలనాథులు పర్యటనలు చేస్తున్నారు.
ఈ క్రమంలోనే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీజేపీ రైతు గోస -బీజేపీ భరోసా పేరుతో భారీ బహిరంగ సభను నిర్వహిస్తుంది.కాగా ఈ సభకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హాజరుకానున్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలోనే కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు.విమానాశ్రయంలో బీజేపీ శ్రేణులు ఆయనకు ఘన స్వాగతం పలికారు.
అనంతరం షా అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో ఖమ్మంకు బయలు దేరారు.అయితే ఖమ్మంలో అమిత్ షా ప్రసంగంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
కాగా సభా వేదికపై నుంచి అమిత్ షా రైతు డిక్లరేషన్ ను ప్రకటించనున్నారు.