బీజేపీకి డిపాజిట్లు గల్లంతవడం ఖాయం..: మంత్రి కేటీఆర్

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటనపై మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.తమ మూడు ప్రధాన హామీల సంగతేంటన్న కేటీఆర్ కాజీపేట కోచ్ ఫ్యాక్టరీకి ప్రాణం పోసేదెప్పుడని ప్రశ్నించారు.

 Bjp Is Sure To Lose Deposits..: Minister Ktr-TeluguStop.com

అదేవిధంగా బయ్యారం ఉక్కు కర్మాగారం నిర్మించేది ఎప్పుడని కేటీఆర్ ట్విట్టర్ వేదికగా నిలదీశారు.తమ పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా దక్కేదెప్పుడో చెప్పాలన్నారు.

ఈ మూడు ప్రధాన హామీలు నెరవేర్చకపోతే వచ్చే ఎన్నికల్లో బీజేపీ గూడు చెదరడం పక్కా అని చెప్పారు.మళ్లీ వంద స్థానాల్లో బీజేపీకి డిపాజిట్లు గల్లంతవడం గ్యారెంటీ అని తెలిపారు.

మోదీ పదేళ్ల పాలనలో నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలనే కాదు 140 కోట్ల భారతీయులను మోసం చేశారని ఆరోపించారు.ఈ నేపథ్యంలో బీజేపీ అధికారంలోకి రావడమనేది జరగదని స్పష్టం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube