BJP : పెండింగ్‎లో ఉన్న లోక్‎సభ అభ్యర్థుల ఎంపికపై బీజేపీ కసరత్తు..!

పెండింగ్‎లో ఉన్న లోక్‎సభ అభ్యర్థుల( Lok Sabha candidates ) ఎంపికపై బీజేపీ హైకమాండ్ స్పెషల్ ఫోకస్ పెట్టింది.ఈ మేరకు తెలంగాణ, ఏపీ సహా వివిధ రాష్ట్రాల పార్టీ అధ్యక్షులతో ఇవాళ అధిష్టానం పెద్దలు భేటీ కానున్నారు.

 Bjp Exercise On The Selection Of Pending Lok Sabha Candidates-TeluguStop.com

సాయంత్రం బీజేపీ కేంద్ర కార్యాలయంలో జరగనున్న ఈ సమావేశంలో నేతలతో అమిత్ షా, జేపీ నడ్డా( Amit Shah, JP Nadda ), బీఎల్ సంతోష్ చర్చలు జరపనున్నారు.

అలాగే ఈ సమావేశంలో ఏపీలో పొత్తుల వ్యవహారంపై కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.ఈ నేపథ్యంలో ఏపీ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల ఆశావహుల జాబితాను రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి( Purandeswari ) అందజేయనున్నారు.కాగా ఇప్పటికే 195 మందితో బీజేపీ తొలి జాబితాను విడుదల చేసిన సంగతి తెలిసిందే.

ఇందులో భాగంగా తెలంగాణ నుంచి తొమ్మిది స్థానాలకు బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube