పెండింగ్లో ఉన్న లోక్సభ అభ్యర్థుల( Lok Sabha candidates ) ఎంపికపై బీజేపీ హైకమాండ్ స్పెషల్ ఫోకస్ పెట్టింది.ఈ మేరకు తెలంగాణ, ఏపీ సహా వివిధ రాష్ట్రాల పార్టీ అధ్యక్షులతో ఇవాళ అధిష్టానం పెద్దలు భేటీ కానున్నారు.
సాయంత్రం బీజేపీ కేంద్ర కార్యాలయంలో జరగనున్న ఈ సమావేశంలో నేతలతో అమిత్ షా, జేపీ నడ్డా( Amit Shah, JP Nadda ), బీఎల్ సంతోష్ చర్చలు జరపనున్నారు.
అలాగే ఈ సమావేశంలో ఏపీలో పొత్తుల వ్యవహారంపై కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.ఈ నేపథ్యంలో ఏపీ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల ఆశావహుల జాబితాను రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి( Purandeswari ) అందజేయనున్నారు.కాగా ఇప్పటికే 195 మందితో బీజేపీ తొలి జాబితాను విడుదల చేసిన సంగతి తెలిసిందే.
ఇందులో భాగంగా తెలంగాణ నుంచి తొమ్మిది స్థానాలకు బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది.