పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్లో ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ కు బిగ్ షాక్ తగిలింది.కార్పొరేషన్ మేయర్ బంగి అనిల్ కుమార్ తో పాటు 20 మంది బీఆర్ఎస్ కార్పొరేటర్లు కాంగ్రెస్ లో చేరనున్నారు.
సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో హస్తం గూటికి చేరేందుకు వీరంతా రంగం సిద్ధం చేసుకున్నారు.ఈ నేపథ్యంలో రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ తో కలిసి హైదరాబాద్ లోని గాంధీభవన్ కు వెళ్లనున్నారు.
అనంతరం రేవంత్ రెడ్డి సమక్షంలో మేయర్, కార్పొరేటర్లు కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు.