యాదాద్రి భువనగిరి జిల్లా: భువనగిరి ఎంపీ టికెట్ కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఇవ్వాలని సంస్థాన్ నారాయణపురం ఐఎన్టియుసి మండల అధ్యక్షుడు రాచకొండ లింగస్వామి అన్నారు.శనివారం మండల కేంద్రంలో ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎంపీ టికెట్ బీసీ అభ్యర్థికి ఇవ్వాలని కోరిన విషయం తెల్సిందేనని, నూటికి 90 శాతం ఉన్న బీసీలను రాజకీయంగా వాడుకొని వదిలేయడం జరుగుతుందన్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండడంతో బీసీలకు న్యాయం జరుగుతుందని కోరుకుంటున్నానని, కాంగ్రెస్ పార్టీ టికెట్ బీసీలకు టిక్కెట్ కేటాయించి రాజకీయంగా ఎదగనివ్వాలని,బీసీలకు రాజ్యాధికారం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందన్నారు.







