ప్రేక్షకులు చూడని 50 రోజుల సినిమా

యంగ్ హీరో నితిన్ నటించిన రీసెంట్ మూవీ భీష్మ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది.ఈ సినిమాను దర్శకుడు వెంకీ కుడుముల డైరెక్ట్ చేయగా పూర్తి రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను అలరించడంలో పూర్తిగా సక్సెస్ అయ్యింది.

 Bheeshma, Nithiin, Rashmika Mandanna, Venky Kudumala-TeluguStop.com

ఇక ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించగా నితిన్‌తో కలిసి ఆమె చేసిన రొమాన్స్‌కు ప్రేక్షకులు ఇంప్రెస్ అయ్యారు.

ఫిబ్రవరి 21న రిలీజ్ అయిన ఈ సినిమాను థియేటర్స్‌లో ఎంజాయ్ చేసిన ప్రేక్షకులు ఆ తరువాత ఈ సినిమా గురించి పూర్తిగా మరిచిపోయారు.

ఈ సినిమా బాగా ఆడుతున్న సమయంలోనే దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమలులోకి వచ్చింది.దీంతో సినిమా థియేటర్స్ పూర్తిగా మూతపడ్డాయి.కాగా ఈ లాక్‌డౌన్ సమయంలోనే భీష్మ చిత్రం 50 రోజులు పూర్తి చేసుకున్నట్లు అసలు పట్టించుకున్నవారే లేరు.

ఏదమైనా ఒక మంచి చిత్రం ప్రేక్షకులు చూడకుండానే 50 రోజులు పూర్తి చేసుకోవడం విశేషం.

ఇక నితిన్ ప్రస్తుతం తన తాజా చిత్రం రంగ్‌దేను రిలీజ్‌కు రెడీ చేస్తున్నారు.కాగా త్వరలో భీష్మ సినిమాను డిజిటల్ ప్లాట్‌ఫాంపై రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube