ప్రస్తుత రోజుల్లో అధిక బరువు సమస్యతో బాధపడుతున్న వారి సంఖ్య భారీ స్థాయిలో ఉంది.పెరిగిన బరువును తగ్గించుకోవడం కోసం చాలా మంది రెగ్యులర్ గా చెమటలు చిందేలా వర్కౌట్స్ చేస్తుంటారు.
కానీ కొందరికి వర్కౌట్స్ చేసేంత సమయం ఉండదు.మరి ఇలాంటి వారు బరువు తగ్గడానికి మార్గం లేదా అంటే ఉంది.
వర్కౌట్స్ చేయకపోయినా బరువు తగ్గొచ్చు.అందుకు ఇప్పుడు చెప్పబోయే స్మూతీ చాలా అద్భుతంగా సహాయపడుతుంది.
మరి ఆ స్మూతీ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ రాగి పిండి( Ragi flour ) వేసి వాటర్ పోసి లూస్ స్ట్రక్చర్ లో మిక్స్ చేసుకోవాలి.
తర్వాత స్టౌ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని ఒకటిన్నర గ్లాసుల వాటర్ పోయాలి.వాటర్ హీట్ అవ్వగానే రాగి మిశ్రమం తో పాటు పావు టేబుల్ స్పూన్ దాల్చిన చెక్క పొడి వేసి పది నుంచి పన్నెండు నిమిషాల పాటు ఉడికించాలి.
ఆపై స్టావ్ ఆఫ్ చేసి ఈ రాగి మిశ్రమాన్ని పూర్తిగా చల్లార పెట్టుకోవాలి.ఆ తర్వాత బ్లెండర్ తీసుకుని అందులో కప్పు యాపిల్ ముక్కలు( Apple ), పది నైట్ అంతా వాటర్ లో నానబెట్టి పొట్టు తొలగించిన బాదం, వన్ టేబుల్ స్పూన్ వేయించిన అవిసె గింజల పొడి,( Flax seeds ) నాలుగు గింజ తొలగించిన ఖర్జూరాలు, అర కప్పు వాటర్ మరియు తయారు చేసి పెట్టుకున్న రాగి మిశ్రమాన్ని వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.తద్వారా మన స్మూతీ సిద్ధమవుతుంది.
ఈ స్మూతీని ఉదయం బ్రేక్ ఫాస్ట్ సమయంలో తీసుకోవాలి.తద్వారా అతి ఆకలి దూరం అవుతుంది.చిరు తిండ్లపై మనసు మళ్లకుండా ఉంటుంది.
అదే సమయంలో మెటబాలిజం రేటు అద్భుతంగా ఇంప్రూవ్ అవుతుంది.దీంతో క్యాలరీలు త్వరగా కరిగి బరువు తగ్గుతారు.
వర్కౌట్స్ చేసేంత సమయం లేనివారు ఈ స్మూతీని డైట్ లో చేర్చుకుంటే చక్కగా వెయిట్ లాస్ అవుతారు.