ఎలాంటి స్పాట్స్ లేకుండా క్లియర్ స్కిన్ పొందాలని అందరూ కోరుకుంటారు.అందుకోసమే ఖరీదైన ఫేస్ క్రీములు, సీరమ్లు, లోషన్లు, మాయిశ్చరైజర్స్ వాడుతుంటారు.
తరచూ బ్యూటీ పార్లర్కు వెళ్లి వేలకు వేలు ఖర్చు పెడుతూ రకరకాల ఫేషియల్స్ చేయించుకుంటారు.అయితే ఎలాంటి ఖర్చు లేకుండా ఇంట్లోనే ఇప్పుడు చెప్పబోయే సూపర్ రెమెడీని ట్రై చేస్తే చాలా అంటే చాలా సులభంగా స్పాట్లెస్ స్కిన్ను తమ సొంతం చేసుకోవచ్చు.
మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రెమెడీ ఏంటీ.? ఎలా ప్రిపేర్ చేసుకోవాలి.? వంటి విషయాలపై ఓ లుక్కేసేయండి.
ముందుగా ఒక కీర దోసను తీసుకుని నీటిలో శుభ్రంగా కడిగి తురుముకోవాలి.
ఈ తురుము నుంచి జ్యూస్ను మాత్రం సపరేట్ చేసుకోవాలి.అలాగే ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ల ఓట్స్ వేసి మెత్తగా పొడి చేసుకోవాలి.
ఇప్పుడు బౌల్ తీసుకుని అందులో నాలుగు టేబుల్ స్పూన్ల కీర జ్యూస్, ఒక ఎగ్ వైట్ వేసి కలుపుకోవాలి.
ఆ తర్వాత ఇందులో వన్ టేబుల్ స్పూన్ ఓట్స్ పౌడర్, వన్ టేబుల్ స్పూన్ మొక్కజొన్న పిండి, హాఫ్ టేబుల్ స్పూన్ రోజ్ వాటర్ వేసి అన్నీ కలిసేలా మిక్స్ చేసుకోవాలి.
ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు అప్లై చేసుకుని ఇరవై నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.ఆపై గోరు వెచ్చని నీటితో శుభ్రంగా ముఖాన్ని క్లీన్ చేసుకుని మీ స్కిన్కు సూట్ అయ్యే మాయిశ్చరైజర్ను రాసుకోవాలి.
ఇలా మూడు లేదా నాలుగు రోజులకు ఒక సారి చేస్తే గనుక.చర్మంపై ఎలాంటి మచ్చలు ఉన్నా క్రమంగా తగ్గిపోయి ముఖం కాంతి వంతంగా, ఫ్రెష్గా మారుతుంది.
అలాగే డెడ్ స్కిన్ సెల్స్ తొలగిపోతాయి.మరియు ముఖం స్మూత్ అండ్ సాఫ్ట్గా సైతం మెరుస్తుంది.