అమెరికాలో బళ్లారి విజయనగర ఇంజినీరింగ్‌ కళాశాల పూర్వ విద్యార్ధుల సమ్మేళనం..!!!

దేశ విదేశాలలో ఉండే ఎంతో మంది తెలుగు ఎన్నారైలు, ముఖ్యంగా కర్ణాటక రాష్ట్రంలోని బళ్లారిలో ఉన్న విజయనగర ఇంజినీరింగ్‌ కళాశాలలో చదివిన పూర్వ విద్యార్ధులు అందరూ కలిసి అమెరికాలో కలుసుకున్నారు.

ఈ వేడుకని ఇర్వింగ్ కన్వెన్షన్ సెంటర్ లో నిర్వహించారు.

నాట్స్ లో అంతర్భాగంగా మూడు రోజులు పాటు వేయి మందికి పైగా వి ఇ సి విద్యార్థులు సందడి చేసి అందరి దృష్టిని ఆకర్షించారు.ఈ సమ్మేళనం కోసం వివిధ దేశాలలో స్థిరపడిన ఎంతో మంది పూర్వ విద్యార్ధులు వారికి విద్యా బుద్ధులు చెప్పిన అధ్యాపకులు కుటుంభ సమేతంగా తెలుగుదనం ఉట్టిపడేలా సాంప్రదాయ బద్ధంగా హాజరయ్యారు.

వీరందరూ కలిసి ఈ సభకి తెలుగుదనం తీసుకొచ్చారు.వీఈసీ ఆధ్యాపకులు, విద్యార్థులతో వారికి ఉన్న అనుభందాన్ని గుర్తు చేసుకున్నారు.విద్యార్థులు కూడా కాలేజీ రోజులు గుర్తు చేసుకుంటూ అప్పట్లో జరిగిన విశేషాలని పంచుకున్నారు.

తాము చేసిన అల్లరి, అధ్యాపకులకి పెట్టిన వింత పేర్లు, చెప్తూ సంతోషంగా గడిపారు.కళాశాలలో స్వామి కాంటీన్, బస్సు దగ్గర, అమ్మాయిల హాస్టల్ దగ్గర చేసిన అల్లర్లు చెప్పుకుంటూ సందడి చేశారు.అబ్బాయిలు చేసిన కామెంట్స్ కి అమ్మాయిల రియాక్షన్లు కూడా గుర్తు చేసుకుని మురిసిపోయారు.

Advertisement

ఈ క్రమంలోనే ఒకరికొకరు భావోద్వేగాలతో, ఆనంద భాష్పాలతో అందరిని ఒక్కసారిగా మౌనం వహించేలా చేశారు.

Advertisement

తాజా వార్తలు